ప్రతి పథకాన్ని మహిళల పేరిటే అమలు చేస్తున్నారు
24 May, 2021 11:42 IST
విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ప్రతి పథకాన్నీ మహిళల పేరిటే అమలు చేస్తున్నారు. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి 2021-22 రాష్ట్ర బడ్జెట్ లో వారికి రూ.47,283.21 కోట్లు కేటాయించారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.