విద్యా రంగం ముఖ చిత్రాన్నే మార్చేశారు
22 Dec, 2020 11:32 IST
విశాఖ: ఏడాదిన్నర కాలంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విద్యా రంగం ముఖ చిత్రాన్నే మార్చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. నాడు-నేడు, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాలకు దాదాపు రూ.13 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, సంక్షేమం అనే 3 అంశాలకు ప్రాధాన్యతనిచ్చారని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.