అయ్యాకొడుకులు ఇంట్లో కూర్చొని చిటికెలేసుకోండి
19 Jun, 2021 12:29 IST
విశాఖ: టీడీపీ నేత నారా లోకేష్ నిన్న కర్నూలు జిల్లాలో చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి ఖండిస్తూ ట్వీట్ చేశారు. లోకేశం..భౌతిక దూరం పాటించాలన్నది మనుషుల మధ్య. నువ్వేంటి మైండ్ కు నీకు మధ్య గ్యాప్ పెంచావు. స్క్రిప్టు రైటర్లిచ్చిన రెండు సినిమా డైలాగులు చెప్తే మాస్ లీడర్ అయిపోతావా? కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా? పెంపుడు కుక్కలతో ఆడుకొంటూ ..అయ్యాకొడుకులు ఇంట్లో కూర్చొని చిటికెలేసుకోండి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.