న్యూఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా, పరిశోదన సంస్థలను ఏర్పాటు చేయాలని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. బుధవారం ఆయన రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయుర్వేదతో పాటు యోగా, నేచురోపతి వైద్య విధానాలను కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రాష్ట్రంలో వైద్య , పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలని కోరినట్లు ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.