రూ.80 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించడం వైయస్ జగన్కే సాధ్యమైంది
13 Mar, 2021 11:40 IST
విశాఖ: 20 నెలల పాలనలోనే రూ.80 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించడంముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీ స్థాపించడం వెనక అందరి లక్ష్యం సేవ చేయడమే. ప్రజా విశ్వాసం చూరగొని అధికారంలోకి రాగలిగితే ఆపన్నులను ఆదుకునే అవకాశం దొరుకుతుంది. గెలిచాక చేద్దాం, చూద్దాం అని కాలం వెళ్లదీసే నేతలే ఎక్కువ. 20 నెలల్లో రూ.80 వేల కోట్ల సంక్షేమ ఫలాల అందించడం జగన్ గారికే సాధ్యమైందంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.