విజయవాడ: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు అంచనాలు పెంచి దోచేశారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. హంద్రీ-నీవా ద్వారా అనంతలోని పేరూర్ డ్యాంకు నీటిని తరలించే కాల్వల తవ్వకానికి బాబు హయాంలో మూడింతలు ఎక్కువగా 850 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సిఎం వైయస్ జగన్ గారు అవే నిధులతో కొత్తగా3.3 టిఎంసీల సామర్థ్యం ఉండే 3 రిజర్వాయర్లకు భూమి పూజ చేశారు. బాబు జమానాలో ఇలాంటివి కోకొల్లలు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.