లబ్ధిదారుల కోసం ప్రభుత్వం గాలిస్తుంటే..
7 Jan, 2021 11:11 IST
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లోమీడియా తీరుపై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. అర్హతలుండీ సంక్షేమ పథకాలు అందని లబ్దిదారుల కోసం ప్రభుత్వం గాలిస్తుంటే, బాబేమో ఏ గుడిని కూల్చాలా అని రాత్రిళ్లు టార్చిలైటు వేసి వెతుకుతున్నాడు. ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడల్లా ఇలా నీచ స్థాయికి దిగజారతాడు. ఎల్లో మీడియా దాస్తూ వచ్చిన క్రూరత్వ కోణం ఇప్పుడు నగ్నంగా బయట పడిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.