తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
నాడు-నేడు పథకం, ఇంగ్లిష్ మీడియం కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గతంలో కంటే 4 లక్షలు పెరిగాయి. ఈ నెల 16న పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా అదే రోజున రెండో విడత నాడు-నేడు పనులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.