న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఎక్కడ శవం దొరుకుతుందా అని ఎదురు చూసి, భుజంపై పాడె మోసేవాడివి. మీ శిష్యుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు బలైన 14 ఏళ్ల పసిబిడ్డ అంత్యక్రియలకైనా వెళ్లాలనిపించలేదా బాబూ? ఎన్టీఆర్ పార్టీకి ఏగతి పట్టించావు. ప్రజాబలం ఎలాగూ లేదు. చిరునామా కూడా లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావ్ అంటూ ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.