తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అధికారంలోకి వస్తామని భ్రమలో బతుకుతున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కాబోయే హోం మినిష్టర్ అచ్చెన్నంట. క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించడానికి బిస్కెట్ వేశాడు. చంద్రబాబు చెవిలో చెప్పి ఉంటాడు. బహిరంగపరిస్తే ఎలా అచ్చెన్నా. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా తాము ఏ శాఖల మంత్రులో చెబుతారంట. పిచ్చి అందరికీ అంటించాడు బాబు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.