విశాఖ: వైయస్ఆర్ సీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి మతంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఖండించారు. కుల పిచ్చితో అడ్డమైన అరాచకాలు చేసి చంద్రబాబు తన రాజకీయ పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. మతం పేరుతో విభజన తీసుకురావాలని ఆరాటపడుతున్న వాళ్ల గతీ అంతే. పోలింగుకు రెండ్రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు? మీకంటే నిఖార్సైన హిందువు ఆయన అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.