కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరతాం
15 Jul, 2021 12:10 IST
తాడేపల్లి: కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరతామని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. భేటీకి ముందు ఎంపీ మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో విశాఖ ఉక్కుపై పోరాడతామన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరతామని తెలిపారు.దిశ చట్టం ఆమోదం, రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తామని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు.