చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ద్రోహి
11 Mar, 2020 15:53 IST
అనంతపురం: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ద్రోహి అని వైయస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఓడిపోయే సీటును దళితులకు కేటాయించడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బలహీనవర్గాలకు కేటాయించిన ఘనత వైయస్ జగన్ది అన్నారు. జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్ల పదవులను సామాన్య కార్యకర్తలకే ఇవ్వడం అభినందనీయమన్నారు.