నెల్లూరు: సంక్షేమం, అభివృద్ధి వైపే ప్రజలు ఉన్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. తిరుపతి ప్రచారంలో ప్రజల నుంచి అనుహ్య స్పందన వస్తోందని ఆయన చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ప్రభంజనంతో చంద్రబాబు ఒంటరి కావడం ఖాయమని పేర్కొన్నారు.