రైతు మోషే కుటుంబానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శ
7 Mar, 2025 12:52 IST
వైయస్ఆర్ జిల్లా: మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామంలో చనిపోయిన మిర్చి రైతు చిపాటి మోషే కుటుంబాన్ని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే బూడిద వల్లే స్థానిక మిర్చిరైతులు నష్టపోతున్నారని రామసుబ్బారెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న మోసే కుటుంబాన్ని దాల్మియా యాజమాన్యం, కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.