అనంతపురం: రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం అండేపల్లి, కంబదూరు గ్రామాల్లో వై.యస్.ఆర్ జలకళ పథకం కింద బోర్లు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్దే లక్ష్యంగా రైతులకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన వైయస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.