సీఎం వైయస్ జగన్ జోలికొస్తే ఊరుకునేది లేదు
22 Oct, 2021 15:03 IST
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్ పై అసభ్యకరంగా విమర్శలు చేయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రం టీ సర్కిల్ లో నిర్వహించిన "జనాగ్రహ దీక్షషలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కే.వి.ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు.