ఆసుపత్రిలో ఎమ్మెల్యే గణేష్ ఆకస్మిక తనిఖీలు
19 Aug, 2019 15:18 IST
విశాఖ: నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గణేష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్యసేవల విధానంపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారపడుతారని చెప్పారు.