అందరికీ సంక్షేమం..అభివృద్ధి ఫలాలు

15 Apr, 2021 12:00 IST

నెల్లూరు:  తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు టీపీ గూడురులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 22 నెలల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో అందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.