నెల్లూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాకాణి శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బండ్ల పాలెం గ్రామంలో స్వర్గీయ కాకాని రమణారెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.