చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరింది

6 Mar, 2021 11:50 IST

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ విమర్శించారు. టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతానికి పైగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.