చంద్రబాబుకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పర్యటించాలి
25 Feb, 2020 14:49 IST
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పర్యటించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ సవాలు విసిరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ 29 గ్రామాల పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి 16 నియోజకవర్గాలకే పరిమితమవుతుంది. త్వరలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుంది.