తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. ఇమ్యూనిటీ బూస్ట్లా మందు పని చేస్తుందా అనే అంశంపై మాత్రమే పరిశోధన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాత టీటీడీ ఆధ్వర్యంలో మందును అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.