‘జనసైనికులారా.. టీడీపీ పల్లకి మోయడానికి సిద్ధంకండి’

14 Mar, 2022 22:08 IST

 అమరావతి: ‘ఇదే  జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం. జనసైనికులారా టీడీపీ పల్లకీ మోయడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగంపై అంబటి రాంబాబు స్పందించారు. ఆయన ప్రసంగం అంతా టీడీపీ పల్లకీ మోసే విధంగానే ఉందని ట్వీట్‌ ద్వారా ప్రశ్నించిన అంబటి.. ఇదే  జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం అని స్పష్టం చేశారు.