తిరుపతి: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎస్వీ వర్సిటీలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ నారాయణ గుప్తా, ఎస్పీ పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం, పరీక్షలు, ఆక్సిజన్ ఏర్పాటుపై చర్చించారు.