అమరావతి: రాజధాని పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 31 లక్షల మంది పేదలకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రకరించారన్నారు. పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్లపై చంద్రబాబు, దేవినేని ఉమా నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.