విజయవాడ: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు లాంటి వాళ్లు 2019లో వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసి బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. కుల, వర్గ, మతతత్వాలు లేని సమ సమాజ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని భూములన్నింటిని సమగ్రంగా రీ సర్వే చేయిస్తామన్నారు. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలుగజేస్తామని చెప్పారు. రాజధానిని ఫ్రీ జోన్గా గుర్తిస్తూ,,వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వెల్లంపల్లి తెలిపారు.