తిరుమల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం బాధాకరమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... జల వివాదం రావడం బాధాకరమని, ఆ శ్రీనివాసుడి కృపతో ఈ వివాదం పరిష్కారం కావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన జలాలను గౌరవప్రదంగా సంపాదించుకోవాలని చెప్పారు. వివాదాలు పడడం వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయని అభిప్రాయపడ్డారు.