విజయవాడ: అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికలపై వైయస్ఆర్సీపీ నేతల సమీక్ష సమావేశం అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయవాడలో టీడీపీకి నాలుగైదు సీట్లు కూడా రావన్నారు. విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ సంగతి చూసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు.