అమరావతి: బందరు పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సభలో ఎమ్మెల్యే జోగిరమేష్ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. బందర్ పోర్టు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డీ నోటిఫికేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.