ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ
27 Sep, 2021 17:32 IST
విజయవాడ: ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ వేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విద్యా సంస్థల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.