మహానేతకు సీఎం వైయస్ జగన్ నివాళి
7 Nov, 2019 11:45 IST
గుంటూరు: గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.