వైయస్ఆర్సీపీ నేతలపై జేసీ వర్గీయుల దాడి
17 Oct, 2022 15:09 IST
అనంతపురం జిల్లా: జూటూరులో టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైయస్ఆర్సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.