ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
3 Mar, 2022 14:17 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జేఈఈ పరీక్షల షెడ్యూల్ దృష్ట్యా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షల కొత్త తేదీలను మంత్రి ప్రకటించారు.