ఘనంగా భగీరథ మహర్షి విగ్రహా ఆవిష్కరణ
17 Feb, 2025 15:10 IST

అనంతపురం: పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. గ్రామ మహిళలతో కలిసి ఉషాశ్రీ చరణ్ నెత్తిన బోనం పెట్టుకుని గ్రామ పురవీధుల తిరుగుతూ బోనాలు సమర్పించారు.