ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు అస్వస్థత

7 Feb, 2022 16:34 IST


 న్యూఢిల్లీ: వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.