మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శ
25 Nov, 2025 16:47 IST
చిత్తూరు: వైయస్ఆర్సీపీ నాయకుడు మోహన్ సోదరుడు నాగేంద్రన్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆర్.కె. రోజా పరామర్శించారు. మంగళవారం ఆమె విజయపురం మండలం జగన్నాధపురం గ్రామంలో పర్యటించారు. నాగేంద్రన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి దైర్యం చెప్పారు. ఈ దుఃఖ సమయంలో పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాగేంద్రన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.