బలవంతపు భూ సేకరణపై రోడ్డెక్కిన రైతులు
6 Oct, 2025 15:58 IST
శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం మండలం నందమూరినగర్ వద్ద బలవంతపు భూ సేకరణను నిరసిస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ 8 గ్రామాల రైతులు సోమవారం ప్రధాన రహదారిపై భైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుందో నిర్ణయించక ముందే బలవంతంగా భూ సేకరణ ఎలా చేస్తారని రెవెన్యూ అధికారులను అన్నదాతలు నిలదీశారు.