వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని డిప్యూటి సీఎం అంజాద్బాషా పేర్కొన్నారు. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు ,మౌజన్ల వేతనాలు పెంచడం చాలా సంతోషమని అన్నారు. వారికి గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. గతంలో ఇచ్చే గౌరవ వేతనాన్ని సీఎం వైయస్ జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారని కొనియాడారు.