రేపు వైయస్ జగన్తో జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం
28 Apr, 2025 17:32 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులతో మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.