ఆరు జిల్లాల్లో నమోదు కాని కరోనా కేసులు

14 May, 2020 12:32 IST

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టింది. గురువారం రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు కరోనా డిశ్చార్జ్‌ల సంఖ్య మరింత పెరుగుతోంది. గత 24 గంటల్లో 9,256 శాంపిళ్లను పరీక్షించగా మరో 36 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 50 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,100గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,192 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 9, గుంటూరులో 5, కడప, కృష్ణా జిల్లాల్లో 2 చొప్పున, నెల్లూరులో 15, శ్రీకాకుళంలో 2 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.  అనంతపురం, కర్నూలు, ఈస్టు గోదావరి, ప్రకాశం, విశాఖ, విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.