వైయస్ఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితమే వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి సాయంత్రం 4. 45గంటలకు కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఎస్టేట్కు వచ్చారు. ఈ రాత్రికి సీఎం అక్కడే బస చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైయస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైయస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.