ఈనెల 19న సీఎం వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన
17 Apr, 2023 16:39 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. శ్రీకాకుళం పర్యటనలో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.