తాడేపల్లి: గిరిజనులహక్కల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. శనివారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవమంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.