తాడేపల్లి: కోవిడ్ నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షిస్తున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇంటి నిర్మాణాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.