తాడేపల్లి: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో గ్రామ,వార్డు సచివాలయాల పనితీరు,నాడు-నేడులో భాగంగా పాఠశాలలు, అంగన్ వాడీలు, ఆసుపత్రుల అభివృద్ధిపై సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు, పంట, ఆస్తినష్టం అంచనాలపై అధికారులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.