తాడేపల్లి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో లాక్డౌన్ కారణంగా పరిశ్రమలకు ఎదురైన ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.