‘కరోనా’పై సీఎం వైయస్ జగన్ అత్యున్నతస్థాయి సమీక్ష
19 Mar, 2020 14:34 IST
తాడేపల్లి: కరోనా వైరస్పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాయంత్రం 4 గంటలకు ఏపీ ఆరోగ్యశాఖ అధికారికంగా వివరాలు వెల్లడించనుంది.