తాడేపల్లి: స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతంపై దిశానిర్దేశం చేస్తారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఖరీఫ్ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అందుబాటుపై సమీక్ష చేపట్టనున్నారు.
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్లు.. బీఎంయూల నిర్మాణ ప్రగతిపై సీఎం వైయస్ జగన్ సమీక్షించనున్నారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై దిశానిర్దేశం చేయడంతో పాటు.. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీల తీరును సమీక్షించనున్నారు.