కాసు రాఘ‌వ‌మ్మ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతాపం

6 Jun, 2021 19:13 IST

తాడేప‌ల్లి: దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ (97) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మ..  హైదరాబాద్‌ సోమాజీగూడలోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. రాఘవమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రాఘవమ్మ కుటుంబ సభ్యులకు సీఎం వైయ‌స్ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.